హైదరాబాద్, ఏప్రిల్ 25: ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.76.83 కోట్ల రికార్డు నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది నమోదైన లాభం కంటే 17.1 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.8 శాతం ఎగబాకి రూ.1,154.14 కోట్లకు చేరుకున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 8,232 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ లభించినట్లు, దీంతో ఇప్పటి వరకు 10 వేలకు పైగా ఆర్డర్లు లభించినట్లు అయింది.