మెదక్, డిసెంబర్ 6: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట శివారులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు చెందిన జమున హేచరీస్ సుమారు 70.33 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములను కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్ చెప్పారు. జమున హేచరీస్ మొత్తం 56 మంది రైతుల భూములను కబ్జా చేయగా బాధితుల్లో 49 మంది బీసీలు, నలుగురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఒకరు ఓసీ వర్గానికి చెందినవారు ఉన్నారని తెలిపారు. ఈ భూములను తిరిగి తమకు ఇప్పించాలని బాధిత రైతు లు కోరినట్టు వెల్లడించారు. సోమవారం ఆయ న మెదక్ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. మాసాయిపేట మం డలం అచ్చంపేటలోని సర్వే నంబర్ 77, 78, 79, 80, 81, 82, 130, హకీంపేటలోని సర్వే నంబర్ 97లో మొత్తం 77.33 ఎకరాల సీలింగ్, అసైన్డ్ (ప్రభుత్వ) భూములను జము న హేచరీస్ కబ్జా చేసినట్టు వివరించారు. అసైన్డ్ భూముల (బదిలీ, నిషేధ) చట్టం- 1977 నిబంధనలను ఉల్లంఘించి కబ్జాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. సదరు అసైన్డ్, సీలింగ్ భూముల్లో రోడ్లు వేసి, రైతులను వారి భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. కబ్జా వ్యవహారంపై గత ఏప్రిల్లోనే తమకు అందిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపినట్టు కలెక్టర్ తెలిపారు. అయితే, జమున హేచరీస్ కోర్టును ఆశ్రయించడంతో ప్రాథమిక నివేదికతో సంబంధం లేకుండా డిటైల్డ్ సర్వే చేయాలని కోర్టు ఆదేశించిందని, కోర్టు ఆదేశాల మేరకు ఆర్డీవో విచారణ చేపట్టారని తెలిపారు. ప్రాథమిక నివేదికలో 65 ఎకరాలు కబ్జా చేసినట్టు తేలిందని, డిటైల్డ్ సర్వే ప్రకారం కబ్జా విస్తీర్ణం 70.33 ఎకరాలుగా ఉన్నట్టు వెల్లడైందని వివరించారు. కబ్జా చేసిన భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్దపెద్ద పౌల్ట్రీ షెడ్లను నిర్మించారని తెలిపారు. వ్యవసాయేతర భూ మార్పిడి అనుమతులు పొందకుండా సర్వే నంబర్లు 78,81,130లో భారీ పౌల్ట్రీషెడ్లు, ప్లాట్ఫారాలు, రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారని వివరించారు. హకీంపేటలోని సర్వే నంబర్ 111లో పౌల్ట్రీ ఫీడ్ నిల్వ చేయడానికి చేపట్టిన నిర్మాణం, అచ్చంపేటలోని సర్వే నంబర్ 130లో భారీ ఎత్తున పౌల్ట్రీ షెడ్ల నిర్మాణాలు, సర్వే నంబర్ 81లో చేపట్టిన నిర్మాణాలకు సంబంధిత స్థానిక పంచాయతీ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని వెల్లడించారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్న షెడ్లను నిలిపి వేయాలని హకీంపేట పంచాయతీ కార్యదర్శికి సూచించినట్టు తెలిపారు.
అక్రమంగా ఎనిమిది ఎకరాలు రిజిస్ట్రేషన్
అచ్చంపేట గ్రామ శివారులో సర్వే నంబర్ 81లో 5 ఎకరాలు, సర్వే నంబర్ 130లో 3 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ జమున హేచరీస్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నదని కలెక్టర్ వెల్లడించారు. 2010లో అప్పటి ప్రభుత్వం ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చిందని పేర్కొన్నారు. రైతుల నుంచి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు ప్రాథమిక రిపోర్టులో తేలిందన్నారు. వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని వెల్లడించారు. అసైన్డ్ భూములపై సెక్షన్ 3, 4-1977 కింద చర్యలు తీసుకుంటామని, సెక్షన్ 7 ప్రకారం క్రిమినల్ చర్యలు కూడా చేపడుతామని తెలిపారు.
పౌల్ట్రీ నుంచి కాలుష్యం
జమునా హేచరీస్ పౌల్ట్రీ నుంచి కాలుష్యం వెలువడుతున్నదని సమీప గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేసినట్టు కలెక్టర్ హరీశ్ తెలిపారు. జమున హేచరీస్ పక్కనే ఉన్న సీలింగ్, అసైన్డ్ భూముల్లో కోళ్ల వ్యర్థాలను డంప్ చేస్తున్నట్టు ఫిర్యాదు రావడంతో పీసీబీ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. కబ్జాలో మరో 200 నుంచి 300 ఎకరాలు అసైన్డ్ భూములుమాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివారులో 579 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములు ఉన్నట్టు సర్వేలో తేలిందని కలెక్టర్ హరీశ్ తెలిపారు. మరో 200 నుంచి 300 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాకు గురైనట్టు ఆయా రైతు లు ఫిర్యాదుచేశారని వెల్లడించారు. సర్వే నంబర్ 130, 72 నుంచి 82 వరకు ఉన్న భూముల (రజియానామా)ను ఆయా రై తులకు రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు ఇ చ్చి దౌర్జన్యంగా లాక్కున్నట్టు జమున హేచరీస్పై ఫిర్యాదులొచ్చాయని చెప్పారు. స మావేశంలో అదనపు కలెక్టర్ రమేశ్, తూ ప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్ పాల్గొన్నారు.