న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్లో విద్యార్థులు ఎక్కడెక్కడ చిక్కుకుపోయారో వారి తల్లిదండ్రులకు తెలిపేలా ఆన్లైన్ పోర్టల్ కానీ, హెల్ప్లైన్ కానీ అభివృద్ధి పరిస్తే బాగుంటుందని కేంద్రానికి సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. గతంలో జరిగిన యుద్ధాల నుంచి మనం ఏమీ నేర్చుకోలేదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.