ఎన్నో ఒడిదుడుకులు వారి సంకల్పం ముందు చిన్నబోయాయి… ఎన్ని కష్టాలైనా వచ్చినా వారి మనోధైర్యం ముందు వెనకడుగు వేశాయి. కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళామణులు ఎందరో.. అంచలంచెలుగా ఎదుగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరికొందరు సామాజిక సేవలో తరిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకుంటున్నారు. ఉత్తమ సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని కొందరు మహిళా మణుల గురించి..
డిచ్పల్లి, మార్చి 7 : పేదరికంతో బాల్యంలో చదువుకు ఆటంకం కలిగింది. పత్తి కంపెనీలో కూలీగా మగ్గారు. అయినా చదువుపై ఉన్న మక్కువతో దూరవిద్య ద్వారా ఉన్నత విద్యనభ్యసించారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖలో అసిసోయేట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు డాక్టర్ వంగరి త్రివేణి. ఎంఎ, ఎంఫిల్, పీహెచ్డీ(తెలుగు), ఎంఏ(సంస్కృతం), ఎంఏ(ఆంగ్లం), నెట్ అండ్ జేఆర్ఎఫ్, తెలుగు పండిత శిక్షణ పూర్తి చేశారు. 25 సంవత్సరాల బోధనానుభవంలో అనియత విద్యాబోధకురాలిగా గ్రేడ్-2, గ్రేడ్- 1 తెలుగు పండిత్ (స్కూల్ అసిస్టెంట్ తెలుగు) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కూడా పని చేశారు.
తెలుగు అధ్యయన శాఖకు విభాగాధిపతిగా, పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్గా వ్యవహరించారు. ప్రజాసంబంధాల అధికారిగా, సాంస్కృతిక కార్యక్రమా ల కోఆర్డినేటర్గా, యువజన సంక్షేమ అధికారిగా తదితర పాలనాపరమైన పదవులు నిర్వర్తించారు. తన పర్యవేక్షణలో ఐదుగురు పరిశోధకులు పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. మరో ఐదుగురు పరిశోధకులు పీహెచ్డీ కొనసాగిస్తున్నారు. తెలుగు ప్రాచీ న సంప్రదాయ భాష, సాహిత్య తత్వశాస్ర్తాల మీద పరిశోధన చేస్తున్నందుకు గాను భారత ప్రభుత్వం ‘మహర్షి బాదరాయణ వ్యాస్ సమ్మాన్ -2019’ రాష్ట్రప తి యువ ప్రోత్సాహ పురస్కారానికి ఎంపిక చే సింది. రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక పురస్కారం-2018, పద్మరత్న జీవన సాఫల్య , ‘పద్మక న్య’, గాదేపల్లి వెం కటమ్మ వీరయ్య యువ సాహిత్య, ప్రమీలాశక్తి విశి ష్ట సాహిత్య పురస్కారాలతో పాటు దాదాపు 30 జాతీయ, రాష్ట్రస్థాయి, ప్రాంతీయ అవార్డులు అం దుకున్నారు.
తెలంగాణ సాహిత్యం-జీవనాధార వృత్తులపై దాదాపు 100కు పైగా పరిశోధనా వ్యా సాలను ప్రచురించారు. వివిధ జాతీయ అంతర్జాతీయ, సాహిత్య సదస్సులతో దాదాపు 100కు పైగా పత్ర సమర్పణలు చేశారు. తెలంగాణ సాహిత్యం-జీవనాధార వృత్తు లు, సాంస్కృతిక అధ్యయనం, తెలంగాణ సాం స్కృతిక వికాసం అనే అంశాలపై అంతర్జాతీయ సదస్సులు, గురజాడ, జాషువా సాహిత్యాలపై జాతీయ సదస్సులు, కథారచన కార్యశాల, ప్రపంచ తెలుగు మహాసభలు, 2012, 2017 నిర్వహణలు తదితర సమావేశాలు నిర్వహించారు. విదేశీ పర్యటనల్లో భాగంగా రెండు పర్యాయాలు అమెరికాలో జరిగిన ఆటా, తానా సభల్లో, సింగాపూర్, మలేసియా, ఆస్ట్రేలియాలో జరిగిన తెలుగు సదస్సుల్లో పాల్గొని సాహిత్య ప్రసంగాలు చేశారు.