ఖలీల్వాడి, నవంబర్ 9 : పేదల ఆర్థికాభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఇందులో భాగంగా స్వయంఉపాధికి నిధులు మంజూరు చేస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 37 మందికి రుణాలు మంజూరుకాగా, నిజామాబాద్ నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిగాల గణేశ్గుప్తా మంగళవారం చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 37 మంది లబ్ధిదారులకు రూ. 50 వేల చొప్పున రూ.18.50 లక్షలు అందజేశామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, టీఆర్ఎస్ నగర అధ్యక్ష, కార్యదర్శులు సిర్ప రాజు, ఎనుగందుల మురళి, నుడా డైరెక్టర్ రాజేంద్రప్రసాద్, కార్పొరేటర్లు బట్టు రాఘవేందర్, సాధు సాయివర్ధన్, శివచరణ్, ధర్మపురి, ఎస్సీ సెల్ నాయకులు నీలగిరి రాజు, సదానంద్, మాచల్ శ్రీనివాస్, బంగారు సాయిలు, ముత్యాలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సూదం రవిచందర్, ముచ్కూర్ నవీన్, బొబ్బిలి మురళి, జగన్, మాదాని శ్రీధర్, రాజేశ్, దేవి, చింతకాయల రాజు, మల్కాయి మహేందర్, మతీన్, మాకు రవి తదితరులు పాల్గొన్నారు.
బైపాస్ రోడ్డు పనుల పరిశీలన
నగరంలోని అర్సపల్లి బైపాస్ రోడ్డు పనులను ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలని, పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు.