Nikhil Kumaraswamy : ఓటర్లను కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందని జేడీ(ఎస్) యువజన విభాగం చీఫ్ నిఖిల్ కుమారస్వామి చెప్పారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అర్ధరాత్రి ఆ పార్టీ రూ. 5000 కూపన్ కార్డులను పంపిణీ చేసిందని అలాంటి పార్టీ ప్రలోభాలకు తెరలేపడం కొత్తేమీ కాదని అన్నారు.
కాంగ్రెస్ నేతలు మళ్లీ యధేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈసారి ఏకంగా కాంగ్రెస్ నేతలు రూ. 10,000 పంచారని నిఖిల్ కుమారస్వామి ఆరోపించారు. గురువారం రాత్రి కాంగ్రెస్ నేతలు పలు చోట్ల ప్రజలకు రూ. 10,000 కూపన్ కార్డులు పంపిణీ చేశారని అన్నారు.
కూపన్ కార్డులు పంచుతుండగా తమ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రలోభాలకు పాల్పడుతున్నా ఎన్నికల కమిషన్ మౌనం దాల్చిందని నిఖిల్ కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రలోభాలకు గురిచేసిన కాంగ్రెస్ నేతలపై ఈసీ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More :
Health Tips | ఇలా చేస్తే వయసుతోపాటు వచ్చే సమస్యలు మీ దరిచేరవు!