హైదరాబాద్, డిసెంబర్ 30: ఈ-కామర్స్ రంగంలో ఉన్న నిహార్ ఇన్ఫో గ్లోబల్ కొత్తగా మూడు అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసింది. ఏపీలో 8 హెక్టార్లలో బెరైటీస్, డొలమైట్ క్వారీని 20 ఏండ్లపాటు లీజుకు తీసుకున్న ఒక మైనింగ్ సంస్థలో నిహార్ మైనింగ్ 45 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. సోలార్ సిస్టమ్స్, ఇతర ఉత్పత్తుల తయారీ, ట్రేడింగ్, దిగుమతులు, ఎగుమతుల వ్యాపారాన్ని నిహార్ రెన్యూవబుల్ ఎనర్జీ చేపట్టనుందని నిహార్ ఇన్ఫో గ్లోబల్ ఎండీ దివ్యేశ్ నిహార్ తెలిపారు. లైఫ్ 108 హెల్త్కేర్ ఔషధాలు, సౌందర్య సాధనాలు, ఫిట్నెస్, ఆరోగ్య సంబంధ పరికరాలను ఆఫ్లైన్తోపాటు ఆన్లైన్లో విక్రయించనున్నదని చెప్పారు. కంపెనీ షేరు ధర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 500 శాతానికిపైగా బలపడింది. గురువారం రూ.19.84 వద్ద నిలిచింది.