ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ రికార్డు క్రియేట్ చేశాయి. నిఫ్టీ( Nifty 50) ఆల్ టైం రికార్డు స్థాపించింది. ట్రేడింగ్లో తొలిసారి 20 వేల పాయింట్లను తాకింది. ఇవాళ మధ్యాహ్నం 3.12 నిమిషాల సమయంలో.. నిఫ్టీ 0.9 శాతం అధికంగా ట్రేడ్ అయ్యింది. 19,997.85 నుంచి అత్యధికంగా 20,002 పాయింట్ల వరకు ట్రేడ్ అయ్యింది. మరో వైపు సెన్సెక్స్ కూడా ఇవాళ దూకుడు ప్రదర్శించింది. 0.8 శాతం అధికంగా సెన్సెక్స్ ట్రేడ్ అయ్యింది. అత్యధికంగా 67,619.17 పాయింట్లను చేరుకున్నది. గత వారం నిఫ్టీ, సెన్సెక్స్లు రెండు శాతం లాభపడిన విషయం తెలిసిందే. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా.. స్టాక్ మార్కెట్లు మాత్రం మంచి లాభాలను ఆర్జించాయి.