ఖమ్మం : ఖమ్మ పట్టణానికి చెందిన సత్య మార్గం సర్వీసు సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ సబ్సిడీపై 60 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేసింది. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె.మధుసూదన్ చేతుల మీదుగా మహిళలకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్లను ప్రదానం జరిగింది. ఎన్జీవో ఆధ్వర్యంలో ఈ మహిళలంతా ఉచిత టైలరింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ సీఐ మాట్లాడుతూ.. నేర్చుకున్న పనితో మహిళలు గౌరవప్రదంగా సంపాదించుకోవచ్చన్నారు.
ప్రతిభ గల వారికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుందన్నారు. మహిళలకు ఉచితంగా శిక్షణను అందజేయడంతో పాటు సబ్సిడీపై కుట్టు మిషన్లు సరఫరా చేసినా సత్య మార్గం యూత్ సర్వీసెస్ ప్రెసిడెంట్ లక్ష్మీని ఇన్స్పెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళా పీఎస్ ఎస్ఐ వి. త్రివేణీ, మాజీ కార్పొరేటర్ సరిత, స్థానిక నాయకులు ఉపేందర్, విజయ్కుమార్ తదితరులు పాల్గన్నారు.