న్యూజిలాండ్తో తొలి టెస్టు
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): టాపార్డర్ రాణించడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ దీటుగా సమాధానమిస్తున్నది. ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మహ్ముదుల్ హసన్ (70 బ్యాటింగ్), నజ్ముల్ హుసేన్ (64) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం చేతిలో 8 వికెట్లు ఉన్న బంగ్లా.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 153 పరుగులు వెనుకబడి ఉంది. మహ్ముదుల్ హసన్తో పాటు కెప్టెన్ మోమినుల్ హక్ (8) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 258/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్.. చివరకు 328 పరుగుల వద్ద ఆలౌటైంది. నికోల్స్ (75) పోరాడాడు.