కైరో : ఆధునిక హంగులతో రాజధాని నగరాన్ని ఈజిప్ట్ నిర్మిస్తున్నది. ఈ నగరం దాదాపు 700 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉంటుంది. మొత్తం వ్యయం 3.30 లక్షల కోట్లు. ఈ నగరంలో 400 కి పైగా అత్యాధునిక వసతులతో కూడిన దవాఖానలు, పాఠశాలలు, కళాశాలలు కూడా నిర్మిస్తున్నారు.
ఈజిప్టు రాజధాని కైరో 3,085 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. 2013 లో ఇక్కడి జనాభా 18 మిలియన్లు కాగా, ప్రస్తుతం 20 మిలియన్లకు చేరింది. 2050 నాటికి 40 మిలియన్లు దాటుతుందని అంచనా. అటువంటి పరిస్థితిలో రాబోయే రోజుల్లో భారీగా ఉండే జనాభాకు ప్రాథమిక సౌకర్యాలు లభించవని నమ్ముతున్నారు. ఈ దృష్ట్యా ఈజిప్టు ప్రభుత్వం.. ప్రస్తుతం ఉన్న కైరో నగరం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఎడారిలో 700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ను నిర్మిస్తున్నది. రానున్న రోజుల్లో ఇక్కడ 65 లక్షల మంది నివసించడానికి వీలుంటుందని అధికారులు చెప్తున్నారు.
కొత్తగా నిర్మిస్తున్న రాజధాని నగరంలో పూర్తిగా ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ న్యూయార్క్, లండన్ నగరాల్లో లభించే సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నారు. నగరం వెలుపల 90 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇది సొంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. నగరం చుట్టూ కృత్రిమ సరస్సులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవే కాకుండా ఎలక్ట్రిక్ రైల్వే లింక్ , కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంటుంది. ఈజిప్టు ప్రభుత్వం ప్రకారం, కొత్త రాజధాని నగరాన్ని సృష్టించడానికి ప్రధాన కారణం పెరుగుతున్న రద్దీని నివారించడమే. ఈ ప్రాజెక్టు ఖర్చు 3.30 లక్షల కోట్లుగా అంచనా.
400 కి పైగా అత్యాధునిక దవాఖానలు, పాఠశాలలు, కళాశాలలు నిర్మిస్తున్నారు.
పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 30,000 గదులతో హోటళ్లు నిర్మిస్తారు.
లండన్ సెంట్రల్ పార్క్ కంటే పెద్ద పార్క్, ప్రపంచంలోని అతిపెద్ద టవర్ నిర్మించనున్నారు.
ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ను కూడా నిర్మిస్తున్నారు. దీనిని 10 సంవత్సరాల్లో మూడు దశల్లో నిర్మించాలని ప్లాన్ చేశారు.
14 వేల ఎకరాలలో షాపింగ్ మాల్, మసీదు, పెద్ద గ్రాండ్ చర్చి కూడా నిర్మించనున్నారు.
2030 నాటికి నగరం సిద్ధమవ్వాలని నిర్ణయించారు.
“మీ ప్రియమైన వారి చేయి వదలకండి”: టీనా అంబానీ సందేశం
తెరపైకొచ్చిన మిక్కీ మౌస్.. చరిత్రలో ఈరోజు
అక్కడ మసీదులు మాయమయ్యాయి.. ఎందుకంటే..?
గూగుల్తో జతకట్టిన ఎలోన్ మస్క్ ‘స్టార్లింక్’
ఉదయం చురుకైన నడకతో కరోనాకు చెక్..!
కరోనాతో విలవిల.. టోక్యో ఒలింపిక్స్ ఎలా..?
నేను చనిపోతే ఎవరెవరు వస్తారో చూస్తా..! ఓ మహిళ డెత్ రిహార్సల్
టీకా తీసుకోండి.. రూ.7.35 కోట్ల జాక్పాట్ గెలుచుకోండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..