హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఖాళీ సీట్లను భర్తీ చేసేందుకు నీట్ పీజీ అన్ని క్యాటగిరీల్లో కటాఫ్ను 15 పర్సెంటైల్ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికనుగుణంగా సవరించిన ఫలితాలను విడుదల చేయాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ను ఆదేశించింది. కేంద్రం సూచన మేరకు బోర్డు నూతన కటాఫ్ను ప్రకటించింది. రెండు పర్యాయాలు కౌన్సెలింగ్ పూర్తయినా ఇంకా 8000 సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. సీట్లు వృథా కాకుండా చూసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.