హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు సన్నద్ధతపై బుధవారం నుంచి పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్టు టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సబ్జెక్టుల వారీగా ప్రత్యక్ష ప్రసారాలు బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు కొనసాగనుండగా, గురువారం ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు క్రాష్కోర్స్ పాఠ్యాంశాలు ప్రసారం అవుతాయని వివరించారు. సందేహాల నివృత్తికి 040 23 556037, 1800 425 4039 టోల్ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.