న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాల్సిందేనని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనికోస నిర్ణయాత్మక అడుగులు వేయాలని చెప్పారు. దేశంలో కొవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. రాష్ట్రాల అభ్యర్థన మేరకు 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. ఇక కరోనాకు చెక్ పెట్టడానికి మాస్క్లు తప్పనిసరి చేయాలని, భౌతిక దూరం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. జనం గుమిగూడే అవకాశం ఉన్న ఈవెంట్లలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగాలని సూచించింది. ఇక ఇండియాలో ఇప్పటి వరకూ 96 శాతం మంది కోలుకున్నారని, చనిపోయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒకటని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు.