హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) అర్హత సమస్యకు పరిష్కారం త్వరలోనే లభించనున్నదని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి శ్రీపాల్రెడ్డి, కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. టెట్ నుంచి ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) సభ్య కార్యదర్శి కేసంగ్ వై షెర్పకు విజ్ఞప్తి చేశారు. ఎస్జీటీ, పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్ఎంగా పదోన్నతి పొందడానికి టెట్ ఉత్తీర్ణత అవసరం లేదని, ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందడానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని తెలిపారు. టెట్ అర్హత పొందడానికి ఐదేండ్ల గడువు అనుమతించే విషయంలో సూచనలు జారీ చేస్తామని సభ్యకార్యదర్శి హా మీ ఇచ్చినట్టు పీఆర్టీయూ నాయకులు తెలిపారు. ఈ విషయమై ఎన్సీటీఈ సభ్యకార్యదర్శిని కలువడానికి యూఎస్పీసీ, జాక్టో నేతలు గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్టు సంఘ నాయకులు జంగయ్య, చావ రవి తెలిపారు. వారితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి కూడా ఢిల్లీకి వస్తున్నట్టు పేర్కొన్నారు.