హైదరాబాద్: టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం మంది, ఎంబైపీసీ విభాగంలో 75.81 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in, https://polycetts.nic.in, www.sbtet.telangana.gov.in వెబ్సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు. కాగా, పాలిటెక్ ప్రవేశాలకు నేడు నోటిఫికేషన్ విడుదల చేస్తామని నవీన్ మిట్టల్ ప్రకటించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జూన్ 30న పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 1,04,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 75.73 శాతం మంది అంటే 79,038 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలురు 40,669 మంది అంటే 72.12 శాతం, బాలికలు 38,369 మంది అంటే 79.99 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
నేడు పాలిసెట్ నోటిఫికేషన్
పాలిసెట్ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని నవీన్ మిట్టల్ ప్రకటించారు. జులై 18 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభవుతాయని, ఆగస్టు 15 వరకు అడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టికల్చర్ వర్సిటీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయన్నారు.