గోండా: జాతీయ యువ రెజ్లర్ నిషా దహియా మరణించిదనే వార్త క్రీడా వర్గాల్లో కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నిషాతో పాటు ఆమె సోదరుడు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం జాతీయ రెజ్లింగ్ టోర్నీ కోసం గోండాలో ఉన్న నిషా.. ఈ వార్తలపై స్పందించింది. ‘నేను సురక్షితంగా ఉన్నాను. జాతీయ టోర్నీలో ఆడేందుకు ఇక్కడికి వచ్చాను. కొద్దిసేపటి క్రితం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విషయం తెలిసింది. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫోన్లు చేశారు. నాకేం కాలేదని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి : పద్మభూషణ్ అందుకున్నప్పుడు పీవీ సింధు కట్టుకున్న చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
టోర్నీ కోసం నేను సిద్ధమవుతున్నాను’ అని సహచర రెజ్లర్ సాక్షి మాలిక్తో కలసి ఉన్న వీడియోలో పేర్కొంది. దీన్ని జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) తమ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే హర్యానా.. సోనేపట్లోని హలాల్పూర్లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన అమ్మాయి పేరు కూడా నిషా దహియా కావడం గమనార్హం. మృతిచెందిన అమ్మాయి రెజ్లింగ్లోకి కొత్తగా వచ్చిందని, చనిపోయిన అమ్మాయి ఈ నిషా దహియా కాదని డబ్ల్యూఎఫ్ఐ వివరణ ఇచ్చింది.