శ్రీనగర్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహిస్తే నేషనల్ కాన్ఫరెన్స్ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందన్నారు. మంగళవారం జమ్మూకాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లోని సాధికారత పంచాయతీరాజ్ సంస్థల కోసం ‘పార్లమెంటరీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అయితే, 2019 బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయనందుకు విచారం వ్యక్తం చేశారు.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు వేదికపై ఉన్న సర్పంచులకు ఆయన పలు సలహాలు ఇచ్చారు. ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, వారి సమస్యలను వినాలని.. ప్రజలను రక్షించేందుకు బ్యూరోక్రట్స్లా వ్యవహరించొద్దని సూచించారు. ఈ సందర్భంగా ప్రజల ఫోన్ కాల్స్కు జమ్మూకాశ్మీర్ పరిపాలన, ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఈ మేరకు సమాధానం ఇచ్చేలా చూడాలని ఎల్జీ సిన్హాను కోరారు. కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి (స్టేట్) ప్రహ్లాద్ పటేల్, విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి హాజరయ్యారు.