కొండాపూర్, నవంబర్ 12 : ఆర్ట్ అండ్ కల్చర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి గణేశ్ పుత్తుర్ ప్రతిష్టాత్మక డాక్టర్ మంగళం స్వామినాథన్ జాతీయ అవార్డు -2021కు ఎంపికైనట్లు వర్సిటీ యాజమాన్యం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. గణేశ్ హిస్టరీ విభాగంలో 2018 -20 విద్యా సంవత్సరంలో ఎంఏ పూర్తి చేయగా.. అతని మళయాలం కవిత ‘అచంటె అలమార’కు ప్రత్యేక అవార్డులు పొందినట్లు తెలిపారు. న్యూ ఢిల్లీలోని ఎన్డీఎంసీ ఆడిటోరియంలో నవంబర్ 29న జరుగనున్న డాక్టర్ మంగళం స్వామినాథన్ ఫౌండేషన్ వార్షిక వేడుకల్లో గణేశ్కు రూ.లక్ష నగదుతో పాటు అవార్డును అందజేయనున్నట్లు పేర్కొన్నారు.