నల్లగొండ : నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా మహిళా సమాఖ్య భవనంలో ఓట్ల లెక్కింపు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
డిసెంబర్ 10న పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సుల తరలింపుపై సూచనలు చేశారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బందికి, ఏజెంట్లకు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే పాస్లపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన వారికే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.