నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 4 : నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన చెరుపల్లి వివేక్తేజ మార్షల్ ఆర్ట్స్లో రాణిస్తున్నాడు. అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపిస్తున్న ఆ యువకుడు కామన్వెల్త్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 7నుంచి 11 వరకు ఇంగ్లాండ్లోని బర్మింగ్హోమ్లో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వరల్డ్ టాప్ ఫైటర్స్ పాల్గొననున్నారు. ఈ పోటీల్లో కుమిటే 84 కిలోల సీనియర్ ఇండివిజివల్ ఫైట్ కరాటే విభాగంలో వివేక్తేజ పాల్గొననున్నాడు.
నల్లగొండకు చెందిన చెరుపల్లి లలిత-దశరథ దంపతుల కూమారుడు వివేక్తేజ ఎనిమిదేండ్ల వయస్సు నుంచే కరాటే ప్రాక్టీస్ ప్రారంభించాడు. తొమ్మిదో తరగతిలోనే బ్లాక్బెల్ట్ సాధించాడు. ఉన్నత చదువు చదివినా మార్షల్ ఆర్ట్స్పై మక్కువను వీడకుండా ప్రాక్టీస్ కొనసాగించాడు. బీటెక్ చేస్తూనే థాయ్లాండ్లో శిక్షణ తీసుకొని మంచి ప్రావీణ్యం సాధించాడు. బీటెక్ పూర్తి చేసిన వివేక్.. వచ్చిన ఉద్యోగావకాశాలను వదులుకొని బాక్సింగ్లో కఠోర సాధన చేశాడు.
ఎనిమిది రకాల మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం
ఒలింపిక్స్లో బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్న వివేక్ తేజ ఇప్పటి వరకు ఎనిమిది రకాల మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం సాధించాడు. థాయ్లాండ్లో బాక్సింగ్, కిక్బాక్సింగ్తోపాటు మొయిథాయ్, ఫుల్ కాంటాక్ట్ కరాటే నేర్చుకున్నాడు. కేరళలో కలరియట్టు, తమిళనాడులో సిలంబం పూర్తి చేశాడు. అదేవిధంగా ఎంఎంఏ, తైక్వాండోలోనూ ప్రావీణ్యం సాధించాడు.
ఒలింపిక్స్లో బంగారు పతకాలు సాధించడమే లక్ష్యం
కామన్వెల్త్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. 2024లో ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్లో భారత్ తరఫున బాక్సింగ్లో పాల్గొని బంగారు పతకాలు సాధించడమే నా లక్ష్యం. స్పాన్సర్లు తోడ్పాటునందిస్తే మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతా.
– వివేక్తేజ, భారత మార్షల్ ఆర్టిస్టు
అంతర్జాతీయ స్థాయిలో సాధించిన మెడల్స్…