కోదాడ, డిసెంబర్ 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన సమక్షంలో మోతె మండలం నామవరం గ్రామానికి చెందిన 300మంది సీపీఐ(ఎంఎల్), కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా అందరికీ సముచిత గౌరవం లభిస్తుందన్నారు. నాయకులు సమన్వయంతో పనిచేస్తూ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. టీఆర్ఎస్ అధికారంలోకొచ్చాక గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తున్నదన్నారు.
గ్రామాల్లో గతంలో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకళతో దర్శనమిస్తున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతుందన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలను అమలు చేస్తున్నదన్నారు. పార్టీలో చేరిన వారిలో వార్డు మెంబర్ లచ్చుమల్ల భద్రయ్య, ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మహిళా మండలాధ్యక్షురాలు శాంతమ్మ, నాయకులు సురేశ్, నర్సయ్య, సాయిలు, కృష్ణయ్య, కమల్వలీ, సైదులు, భూషయ్య, వెంకన్న, సాలయ భాస్కర్, అంజయ్య, వీరయ్య, నాగయ్య, గురువమ్మ, నాగమ్మ, పూలమ్మ, మల్లయ్య, ఝాన్సీ, నాగలక్ష్మి, ఆదమ్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గురజాల మన్సూర్, కల్యాణి, యాదమ్మ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కంపాటి వెంకన్న, సర్పంచ్ నూకల శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ సండ్ర మధు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శీలం సైదులు, గ్రామశాఖ అధ్యక్షుడు పిట్టల నగేశ్, యూత్ అధ్యక్షుడు పాషా, మండల ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్రెడ్డి, నాయకులు మిక్కిలినేని సతీశ్, నవీల, రామకోటి, రమేశ్, పుల్లయ్య, వెంకన్న, మట్టిపల్లి లింగయ్య, బీష్మారెడ్డి, పుట్టా వీరస్వామి, శ్యాంసుందర్రెడ్డి, వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.