ఎమ్మెల్యే నోముల భగత్కుమార్
నందికొండ, డిసెంబర్ 12 : స్వరాష్ట్రంలో కుల వృత్తులకు జీవం పోసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మత్స్యకార్మికుల జీవనోపాధికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలను సోమవారం నందికొండ పైలాన్కాలనీలోని ఎర్త్ డ్యాంపై ఉన్న పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 కంటే ముందు మత్యకారుల జీవనం దుర్భరంగా ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ చెరువులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ కర్న అనూషారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది కృష్ణానదిలో 16.66 లక్షల చేప పిల్లలు వదులుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ మంద రఘువీర్, కౌన్సిలర్లు రమేశ్జీ, మంగ్తానాయక్, ఎఫ్డీఓ సాల్మన్రాజు, మత్స్య సంఘం పట్టణాధ్యక్షుడు కారె రమణ, కార్యదర్శి తాతారావు, ఉపాధ్యక్షడు వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు కర్న శతర్రెడ్డి, రాంబాబు, సైదులు, గుజ్జుల కొండలు, మోహన్నాయక్, విక్రమ్, కృష్ణ, ఎన్నెస్పీ డీఈ సుదర్శన్, ఎస్పీఎఫ్ డీఎస్పీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు
నందికొండ ప్రజలను కేవలం ఓటర్లుగానే చూసిన నాయకులు ప్రస్తుతం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హిల్కాలనీలో రూ.26 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను సోమవారం పరిశీలించారు. అనంతరం విజయవిహార్లో చైర్పర్సన్ కర్ణ అనూషారెడ్డి, కౌన్సిలర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నందికొండకు కేటాయించిన నిధులతో చేపడుతున్న రోడ్లు, డ్రైనేజీ, వైకుంఠధామం, వెజ్,నాన్వెజ్ మార్కెట్ వంటి అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ ఏర్పాటయ్యాకే నాగార్జునసాగర్ను మున్సిపాలిటీగా చేయడంతో పాటు వంద పడకల దవాఖాన, సబ్స్టేషన్, లాంచీస్టేషన్ వంటి అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు. ఎక్కడ అభివృద్ధి అని విమర్శించే నాయకులు తమ సొంత గ్రామాల్లోకి వెళ్లి చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కనిపిస్తాయన్నారు. సీఎం కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని, త్వరలో ఎర్రకోటపై బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమన్నారు.