కామారెడ్డి, సెప్టెంబర్ 6 : కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి దళితులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా.. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షలు దళితులకు వెంటనే ఇవ్వకపోతే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు అక్టోబర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాదీక్ష చేపట్టి, నమ్మించి మోసం చేసిన రేవంత్ సర్కార్కు మాదిగల సత్తా చూపుతామని తెలిపారు. సమావేశంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు కొత్తూరి సాయిలు, దుబ్బాక లక్ష్మి, నారాయణ, రాజేశ్, స్వామి పాల్గొన్నారు.