అమరావతి, జూలై :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి లేఖ రాశారు. గతకొన్నాళ్లుగా ఆయన లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. తాజాగా విశాఖ భూముల కుంభకోణం అంశాన్ని ప్రస్తావిస్తూ జగన్కు మరో లేఖ రాశారు. ఎస్ఐటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరిపి కుంభకోణంతో సంబంధం ఉన్నవారిపై చర్యలు తీసువాలని లేఖలో పేర్కొన్నారు. విశాఖలో అసలు ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి జగన్ కు రఘురామకృష్ణం రాజు లేఖ ద్వారా తెలియజేశారు.