చిక్కడపల్లి, జూలై 1 : నిరుద్యోగుల ఓట్లతోనే రేవంత్కు సీఎం పదవి వచ్చిందని, కానీ ఆయన రెండున్నరేండ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య ధ్వజమెత్తారు. బుధవారం చిక్కడపల్లి నగర గ్రంథాలయంలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుంటే 2028 వరకు కూడా రేవంత్రె డ్డి సీఎంగా ఉండలేరని సవాల్ విసిరారు.
ఉద్యోగాలు ఖాళీ లేకపోతే 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సిం గ్ ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యా, హోం తదితర శాఖలను తన వద్ద పెట్టుకున్న నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్శాఖలో 20 వేల పోస్టులు, 1,600 గ్రూప్-1, 3 వేల గ్రూప్-2, 20వేల గ్రూప్-3,4 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.