హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): కూకట్పల్లిలో జీవోసీఎల్ కార్పొరేష న్, హిందూజా ఎస్టేట్స్, స్వేర్ స్పేస్ ఇన్ఫ్రా సిటీ, ఆనర్ హోమ్స్ తదితర సంస్థలకు చెం దిన సుమారు 300 ఎకరాల భూముల విక్రయ లావాదేవీలపై మధ్యంతర స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ భూములకు సంబంధించి జరిగే అన్ని లావాదేవీలు పిటిషన్పై వెలువరించబోయే తుది తీర్పునకు లోబడి ఉంటాయని షరతులు విధించింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్ బుధవారం మధ్యంతర ఆదేశాలు జారీచేశా రు.
బోడుప్పల్కు చెందిన వ్యాపారవేత్త చిం తల శ్రీనివాస్రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పాశం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రైవేట్ సంస్థలు రెవె న్యూ అధికారులతో కుమ్మకై అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో స్టాంపు డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి రూ.466 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.
జీవోసీఎల్ తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ..1966 నుంచి 1975 మధ్యకాలానికి చెందిన రికార్డుల ప్రకారం ఆ భూములు కొనుగోలు లేదా చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్నవేనని చెప్పారు. ఆనర్ హోమ్స్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదిస్తూ ఈ రిట్ పిటిషన్ను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వానికి మూడు వారాల గడువు మంజూరు చేసి, సంబంధిత రికార్డులు సమర్పించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.