Suicide | ఓ మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెద్దమ్మనగర్కు చెందిన సత్యవాణి, మురళి వేణు దంపతులకు కుమారుడు(5), కుమార్తె(2) ఉన్నారు. అయితే మురళి వేణు తన తండ్రిని డయాలసిస్ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. ఆ సమయంలో సత్యవాణి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి తాను ఉరేసుకుంది.
ఈ ఘటనలో సత్యవతి, ఆమె కుమారుడు మృతి చెందగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Poorna | పూర్ణ ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మి.. రెండోసారి తల్లైన టాలీవుడ్ నటి
Seasonal Allergies | సీజన్ మారుతోంది.. ఈ సమయంలో వచ్చే అలర్జీల నుంచి ఇలా తప్పించుకోండి..
Uttar Pradesh | కెరీర్పై ఫోకస్ చేయమన్నందుకు కవల సోదరి హత్య.. 84 సార్లు కత్తితో పొడిచి చంపిన సోదరుడు