అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. తల్లీ కూతురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. గొల్లపూడి వన్ సెంటర్లో నివాసముంటున్న మాధవి, సత్యవతి అనే తల్లీకూతురు అపార్ట్మెంట్లోని ఐదో అంతస్థు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరు అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు.