కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 5786.88 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది.
ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 4901.16 క్యూసెక్కులు, కాలువలకు 191.84 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 642 అడుగులుగా (3.69 టీఎంసీలు) నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.