న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ తొలకరి జల్లు కురిసింది. రుతుపవనాలు ఆ నగరాన్ని తాకినట్లు ఇవాళ భారతీయ వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో యూపీ, హిమాచల్, జమ్మూకశ్మీర్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇక వర్షం పడే సూచనలు ఉన్నాయి. నైరుతీ రుతుపవనాల వల్ల పంజాబ్, హర్యానాలో కూడా పలు చోట్ల ఇవాళ వాన కురిసింది. వారం నుంచి తీవ్ర ఉక్కపోతతో ఉన్న ఢిల్లీకి ఇవాళ ఊరట లభించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో స్వల్ప స్థాయిలో ఇవాళ వర్షం కురిసింది. దీంతో నగరంలో ట్రాఫిక్ జామైంది. ఢిల్లీ-గూర్గావ్ రోడ్డు మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది.