హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీర్ణం చేసుకొలేక పోతున్నారు. రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కిన ప్రధాని మోదీ అదే సభలో తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల డిమాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇవన్నీ జరిగాక తలుపులు వేసి తెలంగాణ తెచ్చారు అనడం ఏమాత్రం సహించలేనిదన్నారు.
బీజేపీ ప్రజలకు ఏమీ చేయడం లేదని ఆయన విమర్శించారు. మొదటి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని విమర్శించారు.
తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు ప్రెస్ మీట్లు పెట్టి మోదీని సమర్థిస్తున్నారు. తెలంగాణ బిడ్డలై ఉండి కనీసం సోయి లేకుండా మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పద్ధతి మార్చుకోవాలన్నారు.
తెలంగాణ రాకపోయి ఉంటే నువ్వు ఈ రోజు ఆ స్థానంలో ఉండేటోనివి కాదు అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీని తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేస్తారన్నారు.