ఎన్నికలు వస్తున్నాయంటే పెట్రో ధరలు పెరగొద్దు. ప్రజల్లో నిత్యావసరాల ధరలపై అసలు చర్చ జరగొద్దు. బీజేపీ ప్రకటించే తాయిలాలపైనే చర్చ ఉండాలి. అంతిమంగా లబ్ధిపొందాలి. అందుకోసమే గత 85 రోజులుగా దేశంలో పెట్రో ధరలు పెరగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఆధారంగా పెట్రో ధరలు పెరుగుతాయని తెలిసిందే. ప్రస్తుతం ముడి చమురు బ్యారల్ ధర 88 డాలర్ల గరిష్ఠానికి చేరినా పెట్రో ధరల్లో మార్పు రాకపోవడం ఐదు రాష్ర్టాల్లో జరుగుతున్న ఎన్నికల్లో లబ్ధికోసమేనని పరిశీలకులు అంటున్నారు. ఎన్నికలు అయిపోయిన రోజు నుంచే వరుసగా దాదాపు పది రూపాయలకు పైగా వడ్డించే అవకాశం ఉన్నది. దీంతో మరోసారి బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు భగ్గుమనే ప్రమాదం ఉన్నది. తన రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం ఆడుతున్న దొంగాటకు బలవుతున్నది ప్రజలే. ఆయిల్ కంపెనీలను గుప్పిట్లో పెట్టుకొని కేంద్రం ఆడుతున్న మైండ్గేమ్ ఇది.
హైదరాబాద్, జనవరి 27 : దేశంలో ఎప్పుడు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చి నా బీజేపీకి లబ్ధి కలుగుతుందనుకున్నా, ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నదని భా వించినా.. ఆ సమయంలో పెట్రో ధరలు పెరగవు. గతంలో ఈ ధోరణి దేశ ప్రజలకు తెలిసిందే. ఎన్నికలకు ముందు ధరల పెరుగుదలను ఆపడం.. ఎన్నికలయ్యాక ధరల మోత మోగించడం మామూలుగా మారింది. ఇప్పుడు కూడా అదే తంతు కొనసాగుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజులుగా పెట్రో ధరలు స్థిరంగా ఉంటున్నాయి. గత ఏడాది దీపావళికి ముందు పెట్రోల్ ధర లీటరుకు రూ.100 దాటగా, డీజిల్ ధర రూ.100కు చేరువైంది. దీంతో నవంబర్ 3న కేంద్రం పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ. 5 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. నవంబర్ నాలుగు నుంచి దాదాపు 85 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల లేదు. ఈ నెలలో ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతం వరకు పెరిగి బ్యారల్ ధర 88 డాలర్లకు చేరుకున్నది. ఇది 2014 నుంచి పెరిగిన ధరలతో పోల్చుకుంటే అ త్యధికం. యూఏఈలోని చమురు నిల్వలపై శత్రువుల దాడులు, రష్యా-ఉక్రెయిన్ వివాదం తదితర కారణాల నేపథ్యంలో పెరుగుతున్న ముడి చమురు ధరలు వచ్చే కొద్ది నెలల్లో 100 డాలర్లకు చేరుకుంటాయని అంచనా. మరోవైపు, మన దేశ అవసరాల్లో 84శాతం పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటు న్నాం. దీన్నిబట్టి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల ప్రభావం దేశంపై గణనీయంగా ఉం టుంది. అయినా రెండున్నర నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీనికి కారణం ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు జరగనుండటమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. చివరిదశ పోలిం గ్ మార్చి 7న పూర్తికానుండగా, 10న ఫలితాలు వెలువడనున్నాయి. మార్చి 7న చివరిదశ ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగడం తథ్యమని పేర్కొంటున్నారు. దీంతో అందుబాటులో ఉన్న నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా భగ్గుమననున్నాయి.
ఆగి ఆగి ముక్కుపిండి వసూలు
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. సామాన్యుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా పట్టించుకోని కేంద్రం, ఎన్నికలప్పుడు మాత్రం డబుల్ గేమ్ అడుతున్నది. ఎన్నికలప్పుడు పెట్రో ధరలు పెంచని కేంద్రం, ఎన్నికలు అయిపోగానే ఒక్కసారిగా ధరలు పెంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా పెట్రో ధరలు పెంచుకొనే అవకాశం ఆయిల్ కంపెనీలకు చాలా కాలం కిం దటే కేంద్రం ఇచ్చింది. కేవలం ధరల పెంపును ఆమోదించడం, మరీ ఎక్కువైతే నియంత్రిస్తున్నది