హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నా రు. పెరుగుతున్న ఎరువుల ధరలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమాతో రైతులకు కొంత ఉపశమనం కలిగిందని, కానీ మోదీ ప్రభుత్వం రైతులకు ఒక్క పనీ చేయలేదని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు మొండి బకాయిల పేరుతో రుణాలు మాఫీ చేసిన మోదీ సర్కారు, రైతులకు ఒక్క పైసా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు.