హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన నలుగురు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, భాను ప్రసాదరావు, దండే విఠల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను వారు మర్యాద పూర్వకంగా కలిశారు.
సీఎం ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. తమకు ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ఆ నలుగురు ఎమ్మెల్సీలు ధన్యవాదాలు తెలిపారు.
అంతకు ముందు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొత్త సభ్యులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రొటెం చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహ చార్యులుతో కలిసి శాసన మండలి రూల్స్ బుక్స్, ఐడి కార్డు అందజేశారు.