నిజామాబాద్ : జిల్లాలోని కలిగోట్లో జరిగిన బంగారు బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మొదట బతుకమ్మకు పూజలు చేశారు. ఆ తర్వాత స్వయంగా ఎమ్మెల్సీ బతుకమ్మ పాటలు పాడుతూ.. ఆటలాడుతూ ఆడబిడ్డలందరిలో ఉత్సాహాన్ని నింపారు. దాదాపు 5వేల మందికిపైగా సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతుంటే ఆడపిల్లలంతా కేరింతలు కొడుతూ ఆటలాడారు. వేలాది బతుకమ్మ వేడుకల్లో పాల్గొనగా.. ఆ ప్రాంతమంతా కొత్తశోభను సంతరించుకున్నది. ఈ సందర్భంగా పలువురు యువతులో కవితతో సెల్ఫీ ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.