హైదరాబాద్ : దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్లో పలువురు దివ్యాంగులకు ట్రై సైకిల్స్, ఎలక్ట్రిక్ వాహనాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకు రూ.500 ఉన్న దివ్యాంగుల పెన్షన్ను సీఎం కేసీఆర్ రూ.3,016పెంచారని తెలిపారు.
దీంతోపాటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ దివ్యాంగుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని పేర్కొన్నారు.