నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతా ర్యాలీని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేపట్టబోతున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేసిన కవిత కృషిని కొనియాడుతూ.. ఈ కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే నిజామాబాద్ నగర అభివృద్ధికి రూ.60 కోట్ల నిధులను మంజూరు చేసిన కేటీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు.