జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగ్బస్తీలో గల కాళికాదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్, ఎమ్మెల్సీలు నవీన్రావు, శంభీపూర్రాజు, స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధన్రాజుయాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో యావత్ ప్రపంచం కరోనా నుంచి బయటపడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ రశీద్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు బాబుగౌడ్, టీఆర్ఎస్ యువ నాయకులు కొలుకుల జైహింద్, పాపుల్గౌడ్, హజ్రత్అలీ, మనోజ్, గణేశ్, సంతోష్, ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, సంగమేశ్వర్, నాగరాజుచారి, మారుతి, మొనప్పచారి, బాల్రాజు పాల్గొన్నారు.