హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(Dr BR Ambedkar) రచించిన రాజ్యాంగంతోనే అన్ని వర్గాల ప్రజ లకు సమన్యాయం లభిస్తుందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
మోండా డివిజన్..
మోండా డివిజన్ లోని ఆదయ్య నగర్ కమాన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు(Tribute).దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదయ్య నగర్ ఎస్పీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఎం. రాజు, జ్ఞానేశ్వర్, వెంకటేష్ నేత, బీఆర్ఎస్ నాయకులు నాగులు, సాయిబాబా, అమర్ తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్ పేట డివిజన్..
బన్సీలాల్ పేట డివిజన్ లోని బీజేఆర్ నగర్, ఐడీహెచ్ కాలనీలలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. IDH కాలనీలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి, బీఆర్ఎస్ అధ్యక్షులు వెంకటేషన్ రాజు, బీజేఆర్ నగర్ అధ్యక్షుడు బలరాం, నాయకులు గజ్జల శ్రీనివాస్, వినోద్, శివ, నర్సింగ్, మహేష్, శంకర్, మధు తదితరులు పాల్గొన్నారు.
బేగంపేట డివిజన్..
బేగంపేట డివిజన్ లోని ఎన్బీటీ నగర్, ఓల్డ్ కష్టమ్ బస్తీలలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ టి.మహేశ్వరి తో కలిసి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. NBT నగర్ లో అంబేద్కర్ కు నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం అధ్యక్షులు తాళ్ల రాజు, నర్సింగ్ రావు, నాగరాజు, రాజయ్య, అజ్మత్ BRS నాయకులు శ్రీహరి, ఆరీఫ్, ఓల్డ్ కష్ట మ్ కు చెందిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.