నర్సంపేట, అక్టోబర్ 17: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలోని పలు వార్డులకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పెద్ది వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోను చూసిన ప్రతిపక్షాల నేతలు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని కొనియాడారు. ప్రజలు కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మొద్దన్నారు. మళ్లీ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో రెట్టింపు అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాణయణగౌడ్, నల్లా మనోహర్రెడ్డి, కౌన్సిలర్లు దార్ల రమాదేవి, వేల్పుగొండ పద్మరాజు, సదానందం, శివరాత్రిస్వామి, రాయరాకుల సారంగం, యువరాజు పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: బీఆర్ఎస్ ఎన్నిక మేనిఫెస్టో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సర్వాపురం 4వ వార్డులోని కాంగ్రెస్ పార్టీ నుంచి 25 కుటుంబాలు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. రాపోలు సమ్మయ్య, అలుకుంట మురళి, శివరాల కొమ్మాలు, బోసు సమ్మయ్య, శివరాత్రి మల్లమ్మ, సంపంగి సరోజన, శివరాత్రి సారయ్య, సంపంగి మల్లయ్య, శివరాత్రి దుర్గయ్య, దండుగుల శివ, అలుకుంట నర్సమ్మ, రాపోలు తిరుపతమ్మ, బోసు ఐలమ్మ, రాపోలు ఎల్లమ్మ, పల్లపు శిరీష, సంపంగి చిలుకమ్మ, అలుకుంట శ్రావణి, సంపంగి వంశీ, రాపోలు పండు, సంపంగి మల్లికాంబ, శివరాత్రి లక్ష్మి, గండికోట ఐలయ్య, ఓర్సు నాగరాజుతోపాటు మరికొంత మంది ఉన్నారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నర్సంపేటను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇర్ఫాన్, వేనుముద్దల శ్రీధర్రెడ్డి, సంపంగి సాలయ్య, రాపోలు వెంకటస్వామి పాల్గొన్నారు.
దుగ్గొండి: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తున్నదని, దీంతో ఇతర పార్టీల వారు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని నాచినపల్లి, మందపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నాచినపల్లి నుంచి జన్ను గోవర్ధన్, శెట్టి అశోక్, మంద సంజీవ, సుధాకర్, మాదాసి శ్రీనివాస్, మదిరకు చెందిన వారిలో పరుపాటి రఘోత్తంరెడ్డి, పాపిరెడ్డి, విఘ్ణురెడ్డి, మహిపాల్రెడ్డి, వార్డు సభ్యుడు ఈసంపల్లి చేరాలుతోపాటు మరికొందరు ఉన్నారన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ ప్రతినిధి రాజ్కుమార్, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్రెడ్డి, మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, క్లస్టర్ ఇన్చార్జీలు, ప్రజాప్రతినిధులు కంచరకుంట్ల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.