హుజూరాబాద్ :పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలను పెంచిన బిజెపికి ఉపఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఆమె మంగళవారం హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్య పల్లి గ్రామంలో మహిళలతో కలిసి భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అయిన అనంతరం రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు.
రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, కేంద్రం నల్ల చట్టాలు తెచ్చి రైతులను నట్టేట ముంచుతున్నదని, అలాంటి పార్టీలో తన ఆస్తులను కాపాడుకోవడానికి ఈటల చేరడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. హుజురాబాద్ లో ఐదేండ్లు ఎమ్మెల్యే గా ఉండమని నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే మధ్యలోనే ఎందుకు రాజీనామా చేసినవో, ప్రజల ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెట్టినవో చెప్పి ఓట్లు అడగాలని పద్మా దేవేందర్ రెడ్డి ఈటలను నిలదీశారు.