వీణవంక: కేసీఆర్ సారధ్యంలో నడుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, కోట్లాది రూపాలయలతో పేద ప్రజల సంక్షేమ కోసం పథకాలను తీసుకోస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. మండల పరిధిలోని బేతిగల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలను వృద్దులను పలుకరించారు.
గ్రామంలో కూరగాయలు అమ్ముతున్న మహిళతో ముచ్చటించారు.కూరగాయలు అమ్ముతు ఓటు అభ్యర్థించారు. ప్రతి కుటుంబానికి టిఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ది చేకురుతుందన్నారు.పేద ప్రజల కోసం పనుచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వనికి మద్దతు ఇవ్వాలని, హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.