పీర్జాదిగూడ, మార్చి6 : సమాజంలో జర్నలిస్టు పాత్ర కీలకమైందని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్రెడ్డిలు అన్నారు. ఈ మేరకు మేడిపల్లి మండల ప్రింట్ మీడియా సీనియర్స్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర డైరీని శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర అత్యంతపాధాన్యత కలిగినదని, నిస్పాక్షికమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలోఎంతో గురుతర బాధ్యత కలిగి వృత్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రెస్క్లబ్ ప్రతినిధులు డి.రాజిరెడ్డి, వి.రవీందర్గౌడ్, వి.రవిచంద్ర, సీహెచ్.సుదర్శన్, సంకూరి మురళి, లెల్లపాటి నర్సింహరెడ్డి, ఇ.జయపాల్ రెడ్డి, ఎ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.