హైదరాబాద్ : ఏ సర్వే(Surveys) చూసినా ప్రజల్లో బీఆర్ఎస్(BRS) పార్టీకి అనూహ్యంగా మద్దతు పెరిగిందని, పది సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజవర్గ(Parliament Elections) ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ నేతృత్వంలో అర్వపల్లి యోగానంద లక్ష్మి నర్సింహస్వామి ఆలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ప్రత్యేక పూజలు చేసి రోడ్ షో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో తన్నులాటాలు ఎక్కువై వాళ్లకు వల్లే వెన్నుపోటు పొడుచుకుంటారని తెలిపారు. బీఆర్ఎస్ను లేకుండా చేయడం ఎవరితరం కాదని, చంద్రబాబు లాంటి రాక్షసులను తన్ని తరిమేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందన్నారు.
పాలన చేయమంటే తప్పించుకొని తిరుగుతున్న దద్దమ్మ రేవంత్ అని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కరువు తాండవం చేస్తున్నదని, నీళ్లు ఇవ్వమంటే కాంగ్రెస్ నాయకులు తప్పించుకు తిరిగుతున్నారని విమర్శించారు. మాస్ లీడర్, బలహీన వర్గాల నాయకుడు క్యామ మల్లేష్ను భారీ మెజర్టీతో గెలిపించాలన్నారు.