హైదరాబాద్ : ఉన్నత చదువులు చదివి బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్కు (Constable) బుద్ధి గడ్డితింది. అజ్ఞానంతో కళ్లు మూసుకుపోయాయి. మూఢ నమ్మకాలపై(Sorcery) ప్రజలకు కళ్లు తెరిపించాల్సిన కానిస్టేబులే మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో సొంత తండ్రిపై దాడి చేసిన అమానవీయ సంఘటన నిజామాబాద్(Nizamabad)జిల్లా ధర్పల్లి మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్టీఆర్ నగర్కు(NTR Nagar) చెందిన బుచ్చన్న కొడుకు రాజేందర్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, తనపై మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తండ్రి బుచ్చన్నపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కుటుంబ సభ్యులు అడ్డుకొని క్షతగాత్రుడిని హాస్పిటల్కు తరలించారు. రాజేందర్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. నిందితుడు ప్రస్తుతం భీమ్గల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు.