తొర్రూరు, ఏప్రిల్ 25: నాడు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని ఓటుకు నోటుతో, నేడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వాడుకుంటూ ఓటుకు ఒట్టుతో రేవంత్రెడ్డి మోసం చేసేందుకు మరోసారి సిద్ధమయ్యారని హరీశ్రావు ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు రేవంత్రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. నాలుగున్నర నెలలైనా అమలు చేయకపోవటంతో ప్రజల చేతిలో చావుదెబ్బ తప్పదని దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ మళ్లీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ను గెలిపించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పాలకుర్తి నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, బస్వరాజ్ సారయ్య, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, బానోత్ శంకర్నాయక్, నన్నపునేని నరేందర్, ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్ పాల్గొన్నారు.