కమలాపూర్: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అబద్ధాల బీజేపీకి..అభివృద్ధి టీఆర్ఎస్కు మధ్య పోటీ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. జూటా మాటల బీజేపీకి హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో శుక్రవారం ఆయన మండల ఇన్చార్జి పేర్యాల రవీందర్రావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లడుతూ, హుజూరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని చెప్పారు. ఈ ఎన్నికలు ఒక వ్యక్తి తన స్వార్థంకోసం రాజీనామా చేస్తే వచ్చాయని, అలాంటి వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. గ్యాస్, పెట్రో ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్న బీజేపీలో చేరిన ఈటల రాజేందర్కు ఓటేస్తే హుజూరాబాద్కు ఒరిగేదేమీ ఉండదన్నారు.
గెల్లు శ్రీనివాస్యాదవ్ పేదింటి బిడ్డ అని, ఆయనకు ప్రజా సమస్యలు తెలుసని చల్లా ధర్మారెడ్డి చెప్పారు. హుజూరాబాద్ అభివృద్ధికి ఏంచేయాలో గెల్లు శ్రీనివాస్యాదవ్కు ఓ విజన్ ఉందని వివరించారు. నిజాయతీపరుడు, ఉద్యమకారుడైన శ్రీనివాస్యాదవ్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. హుజూరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి, గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపిస్తే హుజూరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ సాంబయ్య, స్థానిక టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.