హైదరాబాద్ : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు మున్సిపల్ వార్డు ఆఫీసుల ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) పేర్కొన్నారు. గురువారం అమీర్ పేట, సనత్ నగర్ లలో చిరు వ్యాపారుల కోసం నిర్మించిన షాపులను ఆయన ప్రారంభించారు. చిరు వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని షాపుల నిర్మాణం జరిగిందన్నారు.
వార్డు ఆఫీసుల్లో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, టౌన్ ప్లానింగ్ అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు.16 వ తేదీన వార్డు ఆఫీసులను ప్రారంభించనున్నామని తెలిపారు.ప్రజలు తమ సమస్యలను వార్డు ఆఫీసుల ద్వారా పరిష్కరించుకునే వీలుంటుందని సూచించారు.దేశంలో ఈ తరహా వ్యవస్థ ఎక్కడా లేదని అన్నారు.మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ఆలోచనల తో వార్డు ఆఫీసులను ఏర్పాటుచేస్తున్నామని పేర్కొన్నారు.