మేడ్చల్: పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని (CM KCR) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను (Double Bedroom houses) ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ (Telangana) అని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఇండ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా కొర్రెములలో 720 మంది లబ్ధిదారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డబుల్ బెడ్రూం ఇడ్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రూ.10 వేల కోట్ల వ్యయంతో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించామన్నారు.
అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 200 మంది లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులను మంత్రి తలసాని అందజేశారు. కులవృత్తుల వారికి అండగా నిలుస్తున్న బీసీ బంధు ఇస్తున్న ఒకేఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. బీసీలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న కేసీఆర్ సర్కార్కు మద్దతు పలకాలని కోరారు. ఈ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.